ఆ రహస్యం చెప్పండి: కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఆహ్వానం
పెద్దపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తమ కుటుంబంలో తప్ప యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడు సీఎం అయ్యాడని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని అన్నారు. గ్రూప్-4లో ఎంపికైన 8,084 మందికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది. కరీంనగర్ గడ్డపై కాలు పెట్టినప్పుడల్లా ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని కలిగించిన సోనియమ్మ గుర్తుకు వస్తారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియమ్మ తెలంగాణ కలను సాకారం చేశారన్నారు.

పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు మా నాయకులను కేసీఆర్ జైల్లో పెట్టారు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. రూ.1035 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నామంటే అది ప్రజా పాలన వల్లేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేం కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే.. కొందరు వాళ్ల భవిష్యత్ చీకటిమయమవుతుందని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పది నెలల మా పాలనపై వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ పది రోజుల్లో తిప్పి కొడదాం. వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడిన చరిత్ర కేసీఆర్ది.
వడ్లు పండించండి.. సన్నాలు వేయండి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పిన చరిత్ర మాది. 33 జిల్లాల్లో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు పండించిన ఘనత పెద్దపల్లి జిల్లాది. 95 శాతం రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ఉద్యమమమే ఉద్యోగాల కోసం మొదలైంది. ఏడాదిలో 55,143 ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు సవాల్ విసురుతున్నా.. 25 ఏళ్లలో మోడీ గుజరాత్లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా... ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అక్షరాల 1 లక్ష రెండువేల కోట్లు కాంట్రాక్టర్లు మెక్కితే.. కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయింది. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో లెక్క తీద్దాం రా..! కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా.. 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించింది. 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది.. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా? ఎవరు చర్చకు వస్తారో రండి.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం..
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. మేం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలను బలోపేతం చేసాం. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీ కావాలని కోరారు.. వాటిని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కనీసం సమస్యలపై ధర్నా చేసుకోలేనంత నిర్బంధాల మధ్య తెలంగాణ పదేళ్లు మగ్గిపోయింది. మేం అధికారంలోకి రాగానే ఇందిరా పార్కు లో ధర్నా చౌక్ లో ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించాం. మా పీసీసీ అధ్యక్షుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. పదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. కానీ, మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యార్థులకు డైట్, చార్జీలు పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
యువత భవితకు హామీ పత్రమై…
— Revanth Reddy (@revanth_anumula) December 4, 2024
సింగరేణి శ్రామికుడి సంక్షేమ రాజ్యమై…
పెద్దపల్లి గడ్డ మీద…
ప్రజా పాలన విజయోత్సవం.#TelanganaRising #PrajaPalana #Peddapally#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/YAE731OA6S
మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగొద్దనే ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు. ప్రజలు మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి... రండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్.
కేసీఆర్.. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదించిన మీ అనుభవాన్ని ప్రజలకు వివరించండి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు? మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications