ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!
అరైవ్.. అలైవ్ పేరుతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూసుఫ్ గూడ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈనెల 13 నుంచి 24 వరకు మొత్తం 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై గ్రామాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2026
వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వాలి
యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోండి
ఆ వివరాలు సింక్ చేయండి, చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్ నుండి కట్ అవ్వాలి - సీఎం… pic.twitter.com/B8UqlRkgqb
అరైవ్.. అలైవ్ పేరుతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దేశంలో ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని. దేశంలో ప్రతి 3 నిమిషాలకో ప్రాణం పోతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలతో జీడీపీపైనా ప్రభావం పడుతుందని తెలిపారు. సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని.. సైబర్ క్రైమ్ ను నియంత్రించడానికి ఫోకస్ పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
" దేశంలో ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. దేశంలో ప్రతి 3 నిమిషాలకో ప్రాణం పోతుంది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీపైనా ప్రభావం పడుతుంది. సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ క్రైమ్ను నియంత్రించడానికి ఫోకస్ పెట్టాం. వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వాలి. యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోండి. ఆ వివరాలు సింక్ చేయండి, చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్ నుండి కట్ అవ్వాలి" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక అంతకుముందు ప్రజా భవన్ లో 'బాల భరోసా' పథకం, 'ప్రణామ్' డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు. దివ్యాంగులను దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే క్రీడల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications