నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ
పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కినేని నాగార్జునపై ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో, నగర అభివృద్ధికి అడ్డుపడే కబ్జాదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లోని అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. వాటిని తొలగించేందుకు 'హైడ్రా' ద్వారా ఆక్రమణల కూల్చివేత జరుగుతోందని వెల్లడించారు. ఈ క్రమంలో, ఎన్ కన్వెన్షన్లో కబ్జాకు గురైన రెండు ఎకరాల భూమిని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని ముఖ్యమంత్రి తెలిపారు. నాగార్జున చర్యను కొనియాడుతూ, ఆయనే 'రియల్ హీరో' అని ప్రశంసించారు.

హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో వంటి వాటితో పోటీ పడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ 'అభివృద్ధి యజ్ఞానికి' ఎంతమంది 'రాక్షసులు' అడ్డుపడినా చేసి తీరుతామని ప్రకటించారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని ప్రజలు గమనించాలని, వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications