Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు: ఇక, సత్సంబంధాలే

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​‌కు సీఎం రేవంత్​ శుభాకాంక్షలు తెలిపారు.​

ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పారు సీఎం రేవంత్. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని రేవంత్ ఆకాంక్షించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

CM Revanth Wishes to Chandrababu Pawan Kalyan for winning in andhra pradesh assembly elections

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఏకంగా 160కిపైగా సీట్లను దక్కించుకుంది. అంతేగాక, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఎన్డీయే కూటమి అభ్యర్థులు 20కిపైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇక, ఏపీలో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందడం గమనార్హం. ఇక, ఎంపీ స్థానాలు కూడా 4కే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలోనే ఏర్పడనుంది. మరోవైపు, దేశ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు నాయుడు కీలక పాత్రను పోషించే అవకాశం వచ్చింది. ఇప్పటికే ఎన్డీఏ కన్వీనర్ గా ఉండాలని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం. దేశంలో ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రావడంతో టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు కీలకంగా మారాయి. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలోనూ ఈ రెండు పార్టీలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+