వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ: మంత్రులకు ఫోన్, కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా మూడోరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివరం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మూడో రోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఫోన్లో ఆదేశించారు.
వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ ముంపుకు గురైన ప్రాంతాల్లో హెలికాప్టర్లు ద్వారా ఆహారం, తాగునీరు. మందులను అందించేలా సీఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరదలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు తగ్గుముఖం పట్టాయి, ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల కొనసాగించాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసి పరిధిలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ముంపు కాలనీలు, మూసీ పరివాహక ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముంపునకు గురైన వైద్య సేవలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వైద్యశాఖలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిగమ్నమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్న మంత్రి హరీశ్ రావు, ఆసుపత్రుల్లో, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలు, మందులు సరఫరా పరిస్థితిని సీఎంకు ఫోన్లో వివరించారు.
ఎగువన గోదావరి ప్రాంతంలో వరద ఉదృతి కొనసాగుతుండటంతో భద్రాచంలో పరిస్థితిపై ముఖ్యమంత్రి.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి జరిగిన నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి సత్యవతి రాథోడ్ ను ఫోన్లో ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
మరోవైపు, ఎగువ నుంచి గోదావరికి వరద పెరగడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యలో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఇన్ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications