వీణావాణిలు స్టేట్ హోంకు తరలింపు, నీలోఫర్ లోనే ఉంటామన్న అవిభక్త కవలలు
అవిభక్త కవలలు వీణా వాణిలను నీలోఫర్ ఆసుపత్రి నుండి స్టేట్ హోం కు తరలించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే వీణావాణిలు స్టేట్ హోంకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అసలు వీణావాణిలకు ఎందుకు స్టేట్ హొంకు తరలి
హైదరాబాద్ :అవిభక్త కవలలు వీణా వాణిలను నీలోఫర్ ఆసుపత్రి నుండి స్టేట్ హోం కు తరలించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే వీణావాణిలు స్టేట్ హోంకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అసలు వీణావాణిలకు ఎందుకు స్టేట్ హొంకు తరలించారనే విషయమై అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు.
పుట్టినప్పటి నుండి నీలోఫర్ ఆసుపత్రిలోనే వీణావాణిలు నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. చికిత్స కోసం కొంతకాలంపాటు ఇతర ప్రాంతాలకు తరలించినా , చివరికి వీణావాణిలకు నీలోఫర్ ఆసుపత్రే ఇల్లుగా మారింది. వారి తల్లిదండ్రులు కూడ అప్పుడప్పుడూ ఈ ఆసుపత్రికి వచ్చి వీణా వాణిలను చూసి వెళ్తుంటారు.
ఊహ తెలిసినప్పటి నుండి నీలోఫర్ ఆసుపత్రిలోనే వీణావాణిలు ఉంటున్నారు. అవిభక్త కవలలైన వీణా వాణిలను విడదీసేందుకు పలు రకాల ప్రయత్నాలు జరిగాయి. శస్త్రచికిత్స చేస్తే కొన్ని సమయాల్లో వారి ప్రాణాలకు ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని కొందరు వైద్యులు హెచ్చరించారు.అయితే నీలోఫర్ ఆసుపత్రిలోనే వారు ఉంటున్నారు.
అవిభక్త కవలలను విడదీయాలని ప్రభుత్వం భావించింది.అయితే అది పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకుండా పోయాయి. వారిని స్టేట్ హొంలోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గత ఏడాది ఆగష్టులోనే నిర్ణయం తీసుకొంది. వీణా వాణిలను శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్ అస్ట్రేలియా చెందిన వైద్యులు ముందుకు వచ్చినా రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది..దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంది.