లక్ష్మీస్ ఎన్టీఆర్పై సీఈసీకి ఫిర్యాదు: ఫిర్యాదు వస్తే పరిశీలిస్తామని తెలంగాణ ఈసీ
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల సంఘాన్ని కలిసిఫిర్యాదు చేశారు.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, తెలుగు రాష్ట్రాలలో జరగనున్న లోకసభ ఎన్నికల పైన ప్రభావం చూపేలా వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని, దీనిని ఆపాలని కోరారు. సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను నెగిటివ్గా చూపించారన్నారు. ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఏప్రిల్ 11 వరకు ఈ సినిమా విడుదల కాకుండా చూడాలన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించనున్నారు.

నేతల బయోపిక్ల విడుదలపై తమకు ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలంగాణ ఈసీ రజత్ కుమార్ తెలిపారు. ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. ఎన్నికలలో సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచామని చెప్పారు. లోకసభ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగాయని, దీంతో తమకు ఇది కొంత సులభం అయిందన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications