కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఖరారు: ఆ స్థానం నుంచి సీపీఐ పోటీ, మరో 2 ఎమ్మెల్సీలు అప్పుడే
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సోమవారం సీపీఐ కార్యాలయానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్సీలకు సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం పొత్తు, ఇతర రాజకీయ అంశాలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చించారు.
కొత్తగూడెం సీటుతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేట్లు ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. రేవంత్ రెడ్డి, నారాయణ, కూనంనేని చర్చల సారాంశాన్ని మీడియాకు వెల్లడించారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేయబోతోందని తెలిపారు. కొత్తగూడెంలో సీపీఐ విజయం కోసం కృషి చేస్తామన్నారు రేవంత్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పారు.

తమకు రాజకీయంగా ఉండే ఒత్తిళ్లు గురించి సీపీఐ నాయకులకు వివరించినట్లు తెలిపారు. నెల రోజుల కిందట నిశ్చితార్థం అయిందని.. ఇవాళ పెళ్లి ముహూర్తం కుదిరిందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేతిలో నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బాగుందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని నారాయణ ఆరోపించారు. బండి సంజయ్కు బండి కట్టి ఇంటికి పంపారని విమర్శించారు. కేసీఆర్ పోకడకి వ్యతిరేకంగా పోరాడటంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమకు అనివార్యమైనట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చూసి ఇతర పార్టీలు కృత్రిమంగా నడుస్తున్నాయన్నారు.
ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలని.. కానీ, బీఆర్ఎస్ ఆ గొంతులను నొక్కేసిందని కూనంనేని విమర్శించారు. సీపీఎంతో కూడా ఏదోక విధంగా అవగాహన వస్తుందని తాము భావించామన్నారు. భవిష్యత్ లో కూడా ఈ స్నేహం ఇలానే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications