హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మూడు లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా మహమ్మద్ సమీర్లను ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ బుధవారం రాత్రి తుదిజాబితాను ప్రకటించింది.
మరోవైపు త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. కాగా, గత కొన్ని రోజులుగా పైమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు సస్పెన్స్లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక, అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

ఖమ్మం స్థానం నుంచి హేమాహేమి నాయకులు తమ కుటుంబసభ్యుకు కేటాయించాల్సిందిగా పట్టుబట్టడంతో, టికెట్ ఖరారు ఆలస్యమయ్యింది. చివరకు అభ్యర్థి ఎంపిక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద బెంగళూరులో పంచాయితీ ముగిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి, తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా అందుకు ఖర్గే అంగీకరించలేదు.
ఈ క్రమంలో మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వర రావు పేరు సూచించినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని ఖర్గేతో పొంగులేటి తేల్చి చెప్పారు. సోదరుడు ప్రసాద రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుపట్టినట్లు సమాచారం. పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారన్న పొంగులేటి.. ఆయనతో బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడిందని చెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు
— Congress for Telangana (@Congress4TS) April 24, 2024
1. కరీంనగర్ - రాజేందర్ రావు
2. హైదరాబాద్ - మొహమ్మద్ సమీర్
3. ఖమ్మం - రఘురాం రెడ్డి
Congress Party MP Candidates
1. Karimnagar - Rajender Rao
2. Hyderabad - Mohammad Sameer
3. Khammam - Raghuram Reddy#TelanganaMLCElections pic.twitter.com/NvcVar1W7Q
తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం. చివరకు ఖమ్మంనకు రఘురామిరెడ్డిని ఎంపికచేశారు. ఇక కరీంనగర్కు వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్కు షమీవలీ ఉల్లా పేర్లను ప్రకటించారు. కాగా, ఖమ్మం అభ్యర్థి రఘురామిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టాలీవుడ్ హీరో వెంకటేశ్ లకు వియ్యంకుడు కావడం గమనార్హం.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications