'రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా గవర్నర్ నరసింహన్, టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తోందనే'
హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించవలసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా మారారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు మంగళవారం విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తెరాస ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేసినా, ధర్నా చౌక్ ఎత్తి వేసినా గవర్నర్ పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజల పక్షాన ఇన్ని రోజులుగా చేస్తున్న పోరాటాలు గవర్నర్కు కనిపించ లేదా అని మండిపడ్డారు.

తెలుగు రాష్ట్రాల నివేదిక పేరిట గవర్నర్ ఢిల్లీకి వెళ్తున్నారని, ఇందులోనూ రాజకీయ మంత్రాంగమే ఉంటుందన్నారు. కర్ణాటకలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు కూడగట్టేందుకే ఏపీలో పర్యటించారన్నారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications