Telangana: ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇదంతా రేవంత్ రెడ్డి కృషి వల్లే..!
కృష్ణాజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా విషయంలో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 పైనా తొలుత వాదనలు వింటామని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ సర్కార్ కీలకంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులు పలు మార్లు చర్చించినట్లు తెలిసింది.
ఎలాగైతే తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కుతోందని ఆలోచనలు చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలని స్పష్టం చేశారు.

దీంతో అధికారులు భారీ కసరత్తు చేశారు. లెక్కలతో పాటు బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వెళ్లారు. దీంతో ట్రైబ్యునల్ వాదనలు వినడానికి ఓకే చెప్పింది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇది తెలంగాణ విజయమని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ వల్లే ఇది జరిగిందన చెబుతోంది.
ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమేననని హరీశ్ రావు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంత ప్రచారం చేసుకున్నా.. ఇది తెలంగాణ విజయమని.. సీఎం రేవంత్ ఘనత అని పేర్కొంటున్నారు. ఇన్ని ప్రభుత్వంలో ఉండి ఏం చేశారని హస్తం నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణకు అన్యాయం జరకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. అందుకే జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 పైనా వాదనాలు వింటామని అంగీకరించిందని పేర్కొంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications