గుండెపోటుతో పడిపోయిన కార్యకర్తను సీపీఆర్ చేసి బ్రతికించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలోని భద్రాచలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ఓ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే స్పందించి సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సరైన సమయానికి స్పందించి కార్యకర్త ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును అందరూ అభినందిస్తున్నారు. గుండెపోటుతో పడిపోయిన కార్యకర్తను దుమ్ముగూడెం మండల కేంద్రానికి చెందిన మోత్కూరు సుధాకార్ గా గుర్తించారు. డాక్టర్ వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో తెల్లం వెంకట్రావు కూడా ఒకరు. అలానే మంత్రి తుమ్మల సైతం కార్యకర్తకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండాలని తెలిపారు.

-
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రద్దు.. పవన్ సంచలన నిర్ణయం వెనుక! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications