మహాకూటమి సీట్ల సర్దుబాటు: కోదండరాం పార్టీకి కాంగ్రెస్ ఆఫర్, మెలిక
Recommended Video

హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా తమకు 12 సీట్లకు పైగా కావాలని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు. చివరకు మంగళవారం 11 సీట్ల వద్ద ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని చెబుతున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ ఓ మెలిక కూడా పెట్టిందట. పలు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపింది. అంటే టీజేఎస్ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చు.

దీనిపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలుస్తోంది. మరోవైపు, తమకు కేటాయించిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై ఆ పార్టీ అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తమకు సీట్లను కేటాయించక పోవడంపై కూడా అసంతృప్తితో ఉంది.
కాగా, తాము పది స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని కోదండరాం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు తెజస తరఫున మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. రైతులకు రూ.2 లక్షల పంట రుణాల మాఫీ, అధికారంలోకి వస్తే తొలి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు, ఏటా ఉద్యోగ క్యాలెండర్, నెలకు రూ.3వేల వరకు నిరుద్యోగ భృతి, తెలంగాణ ఉద్యమకారులపై అన్ని కేసులనూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎత్తివేయడం, సంవత్సరంలో హైదరాబాద్లో అమరుల స్మృతిచిహ్నం ఏర్పాటు, కౌలు రైతులతో సహా వాస్తవ సాగుదారులందరినీ గుర్తించి, వారందరినీ అన్ని ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు లబ్ధిదారులుగా గుర్తించడం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు.
ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఉంటుందని పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రదర్శనశాలగా ప్రగతి భవన్ను మారుస్తామన్నారు. ఈపీసీ వ్యవస్థను రద్దుచేసి, నిర్మాణ పనులను పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతామన్నారు.
స్థానికులకే అవకాశముంటుందన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications