మీరు నేర్పిన విద్యే.. ప్రోటోకాల్ విషయంలో ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోమంటున్న కాంగ్రెస్!!
తెలంగాణలో పదేళ్ళపాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ఓటమి పాలు కావటం, కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అంటుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఎలా బిహేవ్ చేశారో గుర్తు పెట్టుకుని మరీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఫిట్టింగ్ పెడుతుంది.
ఇటీవల దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ జనగామ నియోజకవర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు, జనగామ బరిలో నిలిచి ఓటమిపాలైన కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కూడా వేదిక మీదకు ఆహ్వానించి కూర్చోబెట్టారు. దీంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఓడిపోయిన అభ్యర్ధిని వేదికపైన తనతో సమానంగా ఎలా కూర్చోబెడతారు అని ప్రశ్నించారు. అయితే ఈ నేపధ్యంలో జనగామ ఎమ్మెల్యేకు మంత్రి కొండా సురేఖకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె ఏ మాత్రం తగ్గకుండా సమావేశంలో ఉంటె ఉండండి.. లేకపోతే పొండి అంటూ తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారు .
అయితే ఇక్కడ ప్రోటోకాల్ విషయంలో చేసిన పని గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ప్రజా ప్రతినిధుల విషయంలో చేసిన పనే. పదేళ్ళ కేసీయార్ పాలనలో ప్రోటోకాల్ ఏ మాత్రం పాటించలేదు. మంత్రుల సమీక్షల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలను కాదని ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్ధులను కూర్చోబెట్టి చేసేవారు. ఓడిపోయిన అభ్యర్ధులనే నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమించి వారికి అక్కడ పెత్తనం కట్టబెట్టేవారు.
#Siddipet -Clash between Minister Konda Surekha and Janagama @BRSparty MLA Palla Rajeshwar Reddy at Harita Hotel.Minister Konda Surekha called #Congress leader Kommuri on the stage during the government's official review of Komuravelli fair arrangements at Harita Hotel. pic.twitter.com/kj50hwYQmF
— Mohd Lateef Babla (@lateefbabla) December 30, 2023
అప్పట్లో అనేకమంది ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించటం లేదని లబోదిబోమన్నారు. ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రోటోకాల్ పాటించకపోవటం, అవమానించటం వంటి ఘటనలతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సందర్భాలెన్నో.. ఇక ఈ క్రమంలోనే తమ పార్టీ నుండి ఓటమి పాలైన వారిని కూడా పాలనలో భాగం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు.
అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కాస్త నయమనే చెప్పాలి. బీఆర్ఎస్ కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఏ కార్యక్రమానికి ఆహ్వానించేది కాదు. కానీ కాంగ్రెస్ మంత్రులు తమ సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. కానీ తమ పార్టీ నాయకులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు సమాధానం చెప్తుంది.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications