మల్టీ లెవల్ మోసం: ఏడో తరగతి చదివి, రూ.1200 కోట్లు ముంచారు, విమానమే కొన్నాడు
హైదరాబాద్: మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగు చూసింది. ఏడో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా రూ.1200 కోట్ల మేర కొల్లగొట్టాడు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ ఉంది. సైబరాబాద్ పోలీసులు నిందితుడు రాధేశ్యామ్ను అరెస్ట్ చేశారు. ఇతను హర్యానాకు చెందినవాడు.
ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రయివేటు లిమిటెడ్ సీఎండీ రాధేశ్యామ్, అతనికి సహకరించిన అతని అనుచరుడు సురేందర్ సింగ్ను గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. మూడేళ్ల వ్యవధిలోనే అతను రూ.1200 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో విషయం వెలుగు చూసింది.

ఆకర్షణీయ పథకం
ఒకసారి రూ.7500 కడితే రూ.5వేల విలువైన ఉత్పత్తులు ఇస్తామని, ఆ తర్వాత 24 వెలల పాటు నెలకు రూ.2500 చొప్పున రూ.60 వేలు ఇస్తామని చెబుతాడు. వేరేవారిని ఇందులో చేర్పిస్తే రూ.500 అదనంగా వస్తుందని చెబుతాడు. ఈ ఆకర్షణీయ పథకంతో పెద్ద ఎత్తున డబ్బులు రాబట్టవచ్చునని ప్రజలు చాలామంది పెట్టుబడి పెట్టారు. ఇలా రూ.1200 కోట్లు కూడబెట్టాడు.

వేరేచోట పని చేసి ఆ అనుభవంతో
అతను దాదాపు ఇరవై లక్షల మందిని మోసం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల మంది వరకు ఉన్నారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో రిమాండులోకి తీసుకున్నారు. రాధేశ్యామ్, సురేందర్ సింగ్లు గతంలో పలు మల్టీ లెవల్ కంపెనీల్లో పని చేశారు. ఆ అనుభవంతో వారే కొత్తగా కంపెనీ పెట్టి పథకం వేశారు. ఇందులో భాగంగా ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రయివేటు లిమిటెండ్ను మూడేళ్ల క్రితం ఢిల్లీలో ప్రారంభించారు.

ఏడో తరగతి చదవి, ఆరేడు నెలల్లో ఆకళింపు చేసుకొని
రాధేశ్యామ్ వయస్సు 33. అతను చదివింది ఏడో తరగతి. హర్యానాలోని హిస్సార్ రాష్ట్రానికి చెందినవాడు. ఢిల్లీకి చెందిన ఓ మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలో చేరి కేవలం ఆరేడు నెలల్లోనే అందులోని అంశాలను ఆకళింపు చేసుకున్నాడు. పదిమందినిసభ్యులుగా చేర్పించాలని నిబంధన విధించడం, వేలమందికి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టడంతో మోసం బయటపడింది.

ప్రత్యేకంగా విమానమే కొన్నాడు
మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రారంభించిన కొత్తలో రాధేశ్యాంకు అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో హిస్సార్లో యువతను పోగు చేసి తన కంపెనీ గురించి ప్రచారం చేయించాడు. ఇలా ఏడాదిలో ఐదు లక్షల మంది సభ్యులయ్యారు. ఆ తర్వాత కోట్లలో డబ్బు వచ్చింది. ఖరీదైన కార్లు కొన్నాడు. హిస్సార్ నుంచి ఇతర నగరాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమానమూ కొన్నాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసినా ఫ్యూచర్ మేకర్ వెబ్ సైట్ను కొనసాగిస్తున్నాడు. పోలీసులు అతనికి చెందిన ఖాతాల నుంచి డబ్బు జఫ్తు చేసుకున్నారు. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.125 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.56 కోట్లు, బంధన్ బ్యాంక్ నుంచి రూ.20 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.14 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.2 కోట్లు జఫ్తు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications