Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్‌కు సూచన: దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందన్న డీ రాజా

ఖమ్మం: బీజేపీని ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్.. హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నాన్నారు.

తెలంగాణలో సుపరిపాలన అందుతోందన్న డీ రాజా.. సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, నిరంతరం కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలు తేవాలని సూచించారు.

D Raja slams BJP and RSS in Khammam brs meeting

భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని డీ రాజా ఆరోపించారు. దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందన్నారు. భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందన్నారు. కేంద్రం విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను విస్మరిస్తోందన్నారు. మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారన్నారు.

మోడీ.. పేదలు, రైతుల పక్షాన లేరని.. అదానీ, అంబానీ, టాటా బిర్లా జపం చేస్తున్నారని డీ రాజా ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని.. కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దు మీరుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని, బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+