Damodara Rajanarsimha: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలోనే 25 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్లు!
Damodara Rajanarsimha: మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయిందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం రాగానే వెంటనే 25 వేల పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లోనే 90 శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ చేసేవరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని.. ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. రాబోయే సమావేశాల్లో చట్టం చేస్తే వర్గీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. వర్గీకరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. వారందరి అనుమానాలను నివృత్తి చేస్తామని.. ఆ బాధ్యత మాదేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి తలరాతలు మారుతాయని భావించినట్లుగానే.. ఎస్సీ వర్గీకరణతో మాదిగలందరి తలరాతలు మారుతాయనుకోవడం పొరపాటేనని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల ఎవరి వాటా కింద వారికి అడ్మిషన్లు, ఉద్యోగాలు వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కానీ వంద శాతం ఒక్క వర్గానికే రావని.. మిగతా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గురించి కూడా ఆలోచించాలన్నారు. ఈ పోటీ ప్రపంచంలో మన ఆలోచనలో మార్పు రావాలని.. ఇప్పుడైనా మేలుకోకపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు.

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications