కామారెడ్డికి కాళరాత్రే.. ఏ క్షణమైనా 'పోచారం ప్రాజెక్టు' తెగే ప్రమాదం.. ప్రాణాలు అరచేతిలో..
భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కకావికలం అవుతోంది. వర్ష బీభత్సానికి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ ప్రమాదం అంచుకు చేరింది. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో పది అడుగుల ఎత్తులో అలుగు దుంకుతోంది. భారీ వర్షాలకు గంటగంటకూ వరద తాకిడి స్థాయికి మించి ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా మట్టి కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే దిగువన ఉన్న వందలాది ఎకరాలు నీటమునిగే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
పొంగిపొర్లుతున్న హల్దీ వాగు.!
— Telugu Reporter (@TeluguReporter_) August 27, 2025
ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా.. ఉగ్రరూపం దాల్చిన హల్దీ వాగు..
ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్న మెదక్ ప్రాంత ప్రజలు.#MedakFloods #HaldiVaagu #Medak #TelanganaRains #TelanganaFloods pic.twitter.com/3XkbESy5oY
ఏ క్షణమైనా పోచారం ప్రాజెక్ట్ కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 12 గంటలపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వాగులు, కాలువల దరిదాపుల్లోకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో చాటింపు కూడా వేస్తున్నారు. అలాగే ప్రమాదంలో బీబీపేట పెద్ద చెరువు ఉంది. చెరువు కట్టపై నుంచి వరద నీరు పారుతుంది. చెరువు కట్ట తెగితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిజాంపేట మండలంలో రాంపూర్, నందగోకులం గ్రామాలకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదకర స్థాయిలో పోచారం ప్రాజెక్టు వరద.#Telangana #Pocharam #PocharamReservoir #kamareddy #KamareddyFloods #TelanganaRains #KhyathiConnects pic.twitter.com/1hmbadpCPv
— Khyathi Connects (@KhyathiConnects) August 27, 2025
మరోవైపు మెదక్ జిల్లాలోనూ భారీగా వర్షం నమోదవుతోంది. ఏక ధాటిగా కురుస్తోన్న కుండపోత వర్షానికి వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ధూప్ సింగ్ తండా నీట మునిగింది. ప్రజలు ఇళ్లపైకి చేరి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం నమోదవుతోంది. రాజంపేటలో అత్యధికంగా 32 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలకు కామారెడ్డి - నిజామాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. అటు హైదరాబాద్ - నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో భారీగా వరదనీరు చేరింది. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
-
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications