రాజీవ్ టి20: వీహెచ్ బౌలింగ్..డిగ్గీ బ్యాటింగ్(పిక్చర్స్)
హైదరాబాద్: రెండవ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ(అండర్ 19) ట్వంటీ20 డే అండ్ నైట్ లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 23 వరకు జరిగే ఛాంపియన్షిప్ పోటీలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు.
కాగా, అత్తాపూర్లోని విజయానంద్ క్రీడా మైదానంలోనూ ఈ పోటీలు జరుగుతాయి.
ఇందులో భారత్, పాకిస్థాన్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచులో భాగంగా భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగాయి. ఈ సందర్భంగా రాజ్యసభసభ్యుడు వి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ క్రీడలకు ఎంతో ప్రోత్సహించేవారన్నారు. ప్రతిభ ఒకరి సొత్తు కాదని, యువతకు ఒక్కసారి అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని వీహెచ్ అన్నారు.
ఈ సందర్భంగా వీహెచ్ బంతి విసరగా.. దిగ్విజయ్ సింగ్ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిసిస అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్, మాజీ మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, మర్రి శశిధర్ రెడ్డి, ఎంపి ఖాన్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్సీలు ప్రభాకర్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

వీహెచ్ బౌలింగ్
రెండవ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ(అండర్ 19) ట్వంటీ20 డే అండ్ నైట్ లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఆటగాళ్లతో..
23 వరకు జరిగే ఛాంపియన్షిప్ పోటీలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు.
కాగా, అత్తాపూర్లోని విజయానంద్ క్రీడా మైదానంలోనూ ఈ పోటీలు జరుగుతాయి.

దిగ్విజయ్ బ్యాటింగ్
ఇందులో భారత్, పాకిస్థాన్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచులో భాగంగా భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగాయి.

డిగ్గీ బ్యాటింగ్
ఈ సందర్భంగా రాజ్యసభసభ్యుడు వి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ క్రీడలకు ఎంతో ప్రోత్సహించేవారన్నారు.

బెలూన్లు ఎగరేసి..
ప్రతిభ ఒకరి సొత్తు కాదని, యువతకు ఒక్కసారి అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని వీహెచ్ అన్నారు.












Click it and Unblock the Notifications