Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశమంతా తెలంగాణ అభివృద్ధిపై చర్చ.!రైతు దినోత్సవంలో కల్వకుంట్ల కవిత.!

సదాశివనగర్/హైదరాబాద్: సీఎం చంద్రశేఖర్ రావు కృష్టితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే దండగ అన్న దగ్గరి నుంచి వ్యవసాయం అంటే పండగ అన్న దగ్గరకు సీఎం చంద్రశేఖర్ రావు కృషి చేసారని కవిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు రైతులు గల్లా ఎగరేసుకునే పరిస్థితికి సీఎం చంద్రశేఖర్ రావు తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు.

సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో వ్యవసాయం పండుగ : రైతులు అప్పులు లేకుండా ఎప్పటికీ చేతిలో డబ్బు ఉండేలా, ఎవరినీ చేయిచాచి అడగవద్దన్న లక్ష్యం కోసం సీఎం చంద్రశేఖర్ రావు ముందుకెళ్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం చంద్రశేఖర్ రావు పట్ల రైతుల ఆధరణ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరారు. "తెలంగాణ మోడల్ అంటే ఏంటి అని ఇతర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు అడిగారు. నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తిపోసి పొలాలకు నీళ్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్ అని చెప్పాను. ఐదేళ్లలో 65 లక్షల మంది రైతులకు రూ. 65 వేల కోట్లు ఇవ్వడమే తెలంగాణ మోడల్. ప్రతీ రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ అని చెప్పారు. ఆదే తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరిస్తుంది" అని కల్వకుంట్ల వ్యాఖ్యానించారు.

 kavitha
ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ : అంతే కాకుండా దేశంలో సైనికుల గురించి గొప్పగా మాట్లాడుకుంటామని, ఎండకు వానకు బెదరకుండా దేశానికి రక్షణగా సైనికులు కాపలా ఉంటారని, అదే తరహాలో రైతులు పోలంలో పనిచేస్తూ చెమటచుక్కలు చిందిస్తారు కాబట్టి ప్రతీ ఒక్కరు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామని అన్నారు. అన్నదాతలకు శిరస్సు వంచి కవిత నమస్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసి ఏడ్చామని, అనేక కష్టాలు చూసామని, అవన్నీ మరచిపోలేమని వివరించారు. అప్పట్లో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, రైతుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని గుర్తు చేశారు.

 kavitha
రైతు పథకాలను కాంగ్రెస్ నేతలకు వినపడేట్టు చెప్పండి : రైతు బంధు ఇవ్వగానే అయిపోయిందా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారని, ఆ విషయం సీఎం చంద్రశేఖర్ రావుకు తెలుసు కాబట్టే ఉచిత విద్యుత్తుతో పాటు అనేక రైతు అనుకూల కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల కళ్లకు కనిపించేలా, చెవులకు వినిపించేలా మనం విషయాలను తెలియజేయాలని సూచించారు. రైతులు సంఘాలుగా ఏర్పడి బలంగా ఉండాలన్న ఉద్ధేశంతో రైతు బంధు సమితిలను సీఎం చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 రైతు వేదికలను నిర్మించారని కవిత తెలిపారు.

 kavitha
ప్రతీ రైతుకు రైతు బీమా : రైతులు అందరూ వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుంటా మరింత లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు. మన దేశం ఇప్పటికీ ఏటా దాదాపు లక్ష టన్నుల పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నదని, కాబట్టి పామ్ ఆయిల్ వంటి పంటలు సాగు చేసే దిశగా ఆలోచన చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖను పటిష్టం చేసిన ఎకైక రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు. రైతులకు ఏ ఇబ్బంది జరిగినా, పంట నష్టం జరిగినా, రైతు బీమా వంటివి అందకపోయినా ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు కవిత సూచించారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+