పీకే టీమ్ సలహాతోనే వరి ధాన్యంపై కేసీఆర్ చిల్లర రాజకీయాలు: డీకే అరుణ
టిఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరి ధాన్యంపై కెసిఆర్ అనవసరపు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన డీకే అరుణ కెసిఆర్ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఎటువంటి వివక్ష లేదని డీకే అరుణ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరించిందని అయినప్పటికీ కుట్రపూరితంగా కేంద్రాన్ని విమర్శిస్తున్నారు అంటూ డీకే అరుణ ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో గెలవటం కోసం ఏ గడ్డయినా తింటాడు కేసీఆర్
పీకే టీమ్ సలహాతోనే వరి ధాన్యంపై కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి అని పేర్కొన్న డీకే అరుణ టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పూర్తిగా పడకేసింది అని ఆరోపించారు. ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి కెసిఆర్ వచ్చాడో ముందు ఆ హామీలను నెరవేర్చాలని డీకే అరుణ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఏ గడ్డయినా తినడం కోసం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ది కేవలం ఓట్ల రాజకీయం
తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కేంద్రాన్ని బాధ్యులను చేస్తున్నాడని డీకే అరుణ మండిపడ్డారు. సెంటిమెంట్ తో మరోసారి రైతులు మోసగించడానికి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు అంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, తెలంగాణ కేసీఆర్ రాక ముందే అభివృద్ధి చెందిందని డీకే అరుణ పేర్కొన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పడకేసింది అని డీకే అరుణ విమర్శించారు. కెసిఆర్ ది కేవలం ఓట్ల రాజకీయం అని, ప్రజలకు కెసిఆర్ పై భ్రమలు తొలగిపోయాయి అన్ని డీకే అరుణ పేర్కొన్నారు.

కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ చిల్లర రాజకీయాలు
తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి ప్రకటించాలని డీకే అరుణ పేర్కొన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. అసలు కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించిన డీకే అరుణ మునావర్ ఫారూఖీ లాంటి హిందూ సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళను స్వాగతిస్తాం అంటున్నారని, మీది ఎలాంటి సంస్కృతి అని ప్రశ్నించారు.

దేశాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు
పర్యావరణాన్ని నాశనం చేయడం కోసం జీవో 111 ను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 111 రద్దు చేస్తే హైదరాబాద్ తన అస్తిత్వాన్ని కోల్పోతుందని డీకే అరుణ పేర్కొన్నారు. జీవో 111 కోసం హైదరాబాద్ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు. చాలా దేశాల జీడీపీ తగ్గితే మన దేశంలో జీడీపీ పెరిగిందన్నారు. దేశాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారన్నారు.నిరుద్యోగంలో దేశంలో 6 వ స్థానంలో తెలంగాణా ఉందని పేర్కొన్న డీకే అరుణ ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ కంటే ఎక్కువ జాతీయ ఉపాధి నిధుల క్రింద నిర్మించిన సీసీ రోడ్ల క్వాలిటీని చెక్ చెయ్యాలని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే సీసీ రోడ్లు, సీఎం కేసీఆర్ తెలంగాణా ప్రభుత్వ భూములు ఉండకుండా కేసీఆర్ చేస్తున్నాడని డీకే అరుణ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications