జూపల్లి.. జూలో పిల్లి, మేం కాపలా కుక్కలం: డికె అరుణ తీవ్ర వ్యాఖ్యలు
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూపల్లి జూలో పిల్లి అని, ఆయన వ్యాఖ్యలకు తాను స్పందించనని చెప్పారు. ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. స్థాయి, వ్యక్తిత్వం లేని ఆయన మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడితే స్పందిస్తానని చెప్పారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, అంచనాలు వంటి వాటిలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అవినీతిలో ఉన్న వారంతా కెసిఆర్ బినామీలే అన్నారు. అక్రమాలు అడ్డుకోవడానికే కాపలు కుక్కల్లా తాము పని చేస్తామని డీకే అరుణ చెప్పారు.
ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకొని, ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడిచే నైపుణ్యం లేని వారికి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో అవినీతిని సహించబోమని, కెసిఆర్ దోపిడీని అడ్డుకునేందుకు కాపలా కుక్కలా ఉంటామన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications