జగన్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్..పదే పదే ఒకే మాట..!!
తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఇవే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన మద్దతుగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
తాజాగా, కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మహారాష్ట్రలో ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని.. అదేవిధంగా మన భారతదేశంలో కూడా వెళ్లాల్సిన అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఆదివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హర్యానాలోనైనా, ఈరోజు మహారాష్ట్రలోనైనా బీజేపీ గెలిచినప్పుడల్లా.. ఏ రకంగానైనా అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటు అని దేశ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. హర్యానా, మహారాష్ట్రలో కూడా మనం ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియలపై మన నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు.
రానున్న కాలంలో ఏ రాజకీయ పార్టీ చేసినా ఈవీఎంలతో మన ప్రజాస్వామ్యం ఏం చేస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని, దీనిపై చర్చించి అందరి విశ్వాసాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకాలన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎన్నికల సంఘం మరోసారి ఆలోచించాలి. ఈ టెక్నాలజీని అలవర్చుకోవాలి. లేదంటే ఈవీఎంల నుంచి సాధారణ బ్యాలెట్ పత్రాలకు దారితీసిన ఇతర దేశాల మాదిరిగా వెళ్లాల్సిన అవసరం ఉంది అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi: Congress MP Chamala Kiran Kumar says, "Congress always wants to tell the people of the country that whenever BJP wins, whether it is in Haryana or today in Maharashtra, BJP has a habit of coming to power by any means... Even in Haryana, we got results that we did… pic.twitter.com/a6phNQfQQ8
— ANI (@ANI) November 24, 2024
జగన్ చెప్పిందే.. కాంగ్రెస్ నేతలు
కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై జగన్ తోపాటు వైసీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఏపీలో ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని.. కానీ ఎన్నికల్లో మాత్రం తాము ఎలా ఓటమి పాలవుతామని జగన్ ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications