వేధింపులు: సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: బాలాపూర్లోని మినార్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన వాంగూల్మాన్ని రికార్డు చేసింది. భర్త, అత్త, ఆడపడుచు వేధింపులే తన చావుకు కారణమని వీడియోలో పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. మినార్ కాలనీలో నివసించే అంజుమ్(20)కు యాకుత్పురాకు చెందిన ఇర్ఫాన్తో ఈ యేడాది జనవరి 13న వివాహమైంది. పెళ్లి జరిగిన నాటి నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం తనను నిత్య వేధించేవారని, దీంతో తనను పది రోజుల క్రితం తండ్రి పుట్టింటికి తీసుకొచ్చారని అంజుమ్ ఆ వీడియోలో తెలిపింది.

తనను తల్లిదండ్రులు క్షమించాలని కోరుతూ బాత్రూమ్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమినించి ఒవైసీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన కూతురు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications