Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా ఆటకట్టు: రాజమండ్రికి చెందిన నలుగురి అరెస్ట్

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ముఠా ఆటను కట్టించారు పోలీసులు. గోవా నుంచి హైదరాబాద్‌​కు డ్రగ్స్ తరలించి విక్రయాలు జరుపుతున్న నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల కొకైన్‌​తో పాటు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన విక్కీ, రాజేష్ గోపిశెట్టి, నరేష్, తోట క్రాంతి కుమార్​లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు విక్కీ సులభంగా డబ్బులను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అమ్మకాలను జరుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. విక్కీ, రాజేష్‌​లు చిరు వ్యాపారులకు కొకైన్‌​ను డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎన్డీపీఎస్​ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Drugs Seized in Raidurgam, Hyderabad: four accused arrested

కాగా, గతంలో కూడా విక్కీ డ్రగ్స్ విక్రయాలను జరిపిన్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఇది ఇలావుండగా, మదాపూర్​ డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీనటుడు నవదీప్ ​కు(Navdeep) ఈడీ నోటీసులు జారీచేసింది. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్ ​తో పాటు మనీలాండరింగ్​ కోణంలోనూ ఈడీ విచారణ చేపట్టనుంది.

ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్​ పోలీసులు నవదీప్ ​ను విచారించిన విషయం తెలిసిందే. నవదీప్ తన మొబైల్​లో ఉన్న డేటాని డిలీట్​ చేసినట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 81 లింకు​లు గుర్తించారని తెలిపారు. ఇందులో 41 లింకులపై ఉన్న వివరాలను తెలిపాడని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+