Raghunandan Rao: అయ్యప్ప మాలలో ఉండి అసత్యాలా.. రోహిత్ రెడ్డిపై రఘునందన్ రావు ఫైర్..
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపణలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం తప్పన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని నిలదీశారు. వారి ఆరోపణలే నిజమైతే.. తనపై విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబ ఆస్తులు
తన ఆస్తుల వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్టు రఘునందన్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడానికి సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. రోహిత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్రావు గుర్తు చేశారు.

రూ.10 కోట్ల విల్లా
రఘునందన్ రావుపై రోహిత్ రెడ్డి ఆదివారం పలు ఆరోపణలు చేశారు. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. రోహిత్ రెడ్డి ఆరోపణలకు రఘునందన్ రావు పై వింధంగా కౌంటర్ ఇచ్చారు. విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ విషయం పక్కన పెట్టి, సంబంధం లేని వాటి గురించి మాట్లాడారని విమర్శించారు.

2013లో
2018 ఎన్నికల ప్రచారంలో దొరలు తిరిగే కారు కావాలా.. అన్నం తినే చేయి కావాలా అని రోహిత్ రెడ్డి అడిగిన విషయాన్ని రఘునందన్ గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మీడియా సమావేశంలో చూపించారు. దమ్ముంటే 2013లో తనపై చేసిన ఆరోపణలను ఎప్పుడు రుజువు చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పన్ పల్లి భూములకు, రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనట్టయితే చీఫ్ సెక్రటరీకి లేఖ రాయమని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

ఈడీ విచారణ
కాగా..ఫైలట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తను మాలలో ఉన్నానని.. తర్వాత విచారణకు వస్తానని పీఏ ను పంపి ఈడీకి సమాచారం ఇచ్చారు. రోహిత్ రెడ్డి అభ్యర్థను ఈసీ తిరస్కరించడంతో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ మూడ్రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. 2015 నుంచి రోహిత్రెడ్డితోపాటు కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, జీఎస్టీ రిటర్న్స్, ఐటీ, బ్యాంకు స్టేట్మెంట్స్, ఆధార్, పాన్కార్డు, పాస్పోర్టు కాపీలు తీసుకురావాలంటూ ఈడీ నోటీసుల్లో కోరింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications