రాజకీయ నేతల్లో 80 శాతం అవినీతిపరులే.. శిక్ష పడితేనే ఇతరుల్లో భయం.. సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు
దేశంలో అవినీతిపరులకు తక్షణమే శిక్ష పడితే ఇతరుల్లో భయం పడుతుందన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అప్పుడేఉ అవినీతి చేయడానికి వెనుకాడతారన్నారు. ప్రభుత్వ విభాగాల్లో సాంకేతికతను ఉపయోగిస్తే అవినీతిని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు తాము నిర్వర్తించాల్సిన విధులకు రేటు కడితే.. ప్రజలు ఉపేక్షించొద్దని ఆయన సూచించారు.

ప్రభుత్వ విభాగాల్లోనే అవినీతి
అవినీతిలో భారతదేశం 86 స్థానంలో ఉందన్నారు లక్ష్మీనారాయణ . ఇది గత ఏడాది కంటే ఈ ఏడాది ఆరు శాతం పెరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వేను మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే ఈ అవినీతి కనిపిస్తోందన్నారు.

సాంకేతికతో అవినీతికి అడ్డుకట్ట
ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించి ప్రజల పనులు జరిపించినప్పుడే అవినీతిని అంతం అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్ కంట్యాక్స్ విభాగాన్ని ఎలాగైతే అన్ లైన్ చేశారో అలాగే ప్రతి విభాగంలో టెక్నాలజీ ఉపయోగిస్తే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుతుందని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఎవరైన లంచం అడిగితే సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.

లంచం ఇవ్వనిదే పనికాదు..
తెలుగు రాష్ట్రాల్లో లంచం ఇవ్వనిదే ఎలాంటి పనులు కావడంలేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే నివేదికలో వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైగానే అవినీతి నెలకొందని తేలింది. అధికారులలో 80 శాతం మంది అవినీతిపరులే ఉన్నారన్న ప్రజల అభిప్రాయాన్ని తన సర్వే రిపోర్టు పేర్కొంది. రెవెన్యూ శాఖలో 85 శాతం అవినీతి ఎక్కువ ఉందని వెల్లడించింది.

రాజకీయ నాయకుల్లో 80 శాతం అవినీతిపరులే..
రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో 80 శాతం మంది అవినీతిపరులేనని ప్రజల తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సర్వే పేర్కొంది. మూడో స్థానంలో పోలీస్ విభాగం అవినీతి 79 శాతం ఉందని తేల్చింది. అవినీతి నిర్మూలన కోసం పనిచేసే విజిలెన్స్ కమిషన్ , యాంటీ కరప్షన్ బ్యూరో వంటి వాటిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే వివరాలను వెల్లడించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications