'జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారు? పదివేల చీరలు ఎక్కడికిపోయాయి?'
'మనం చనిపోయినప్పుడు.. పోతే పోయిండులే అన్న రీతిలో కాకుండా.. అయ్యో.. అనిపించుకోవాలె' అని ఈటెల అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: తమిళనాడు సీఎం జయలలితపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. బ్లాక్ మనీ, మానవ విలువల వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో జయలలిత జీవితాన్ని ఉదహరిస్తూ పోయేటప్పుడు ఎవరేమి తీసుకుపోలేరని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా ఓ కాలేజీ కార్యక్రమంలో తాను పాల్గొన్న విషయం గురించి చెబుతూ.. తన ప్రసంగం ముగిసిన తర్వాత కాలేజీ విద్యార్థులంతా ఆహా, ఓహా అన్నారని గుర్తు చేశారు. పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకుపోలేమని, జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారని, ఆమె పది వేల చీరలు ఏమై పోయాయని ఆయన ప్రశ్నించారు.

'మనం చనిపోయినప్పుడు.. పోతే పోయిండులే అన్న రీతిలో కాకుండా.. అయ్యో.. అనిపించుకోవాలె' అని ఈటెల అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా తాను దేవుడిని నమ్మనని ఈటెల రాజేందర్ తెలిపారు. తనకు దేవుడిపై విశ్వాసం లేకున్నా రూ.5 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
పాత కరీంనగర్ జిల్లాలో రూ.15 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. సామూహిక వివాహాలు కూడా చేయిస్తున్నట్టు తెలియజేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications