రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: జానా రెడ్డి నినాదం
హైదరాబాద్/ నల్లగొండ: రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాగాపూర్, దొండపల్లిలో ఆత్మహత్య చేసుకున్న, రైతు కుటుంబాలను కాంగ్రెస్ నేతలు సబితా, ప్రతాప్కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరామర్శించారు.
రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే ఆయన ఈ సందర్బంగా అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని జానారెడ్డి తెలిపారు.

రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, ఒకే దఫాలో రుణమాఫీ చేసింటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
జూన్ 2 నుంచి చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications