బూమ్ రాంగ్, షర్మిల కీలక నిర్ణయం - టార్గెట్ రేవంత్...!!
వైఎస్ షర్మిల అనుకున్నది ఒకటి. జరుగుతోంది మరొకటి. అన్నీ మరిచి కాంగ్రెస్ తో విలీనానికి సిద్దమయ్యారు. కానీ, కాంగ్రెస్ తత్వం బోధపడింది. అయినా సర్దుకుపోవాలా.. ఒంటరి పోరుతో సత్తా చాటాలా అనే డైలమాలో షర్మిల ఉన్నారు. కాంగ్రెస్ కు తుది నిర్ణయం కోసం విధించిన డెడ్ లైన్ పూర్తయింది. ఇక వెయిటింగ్ అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కా..షర్మిలకా...నష్టం ఎవరికి.
విలీనం పై డైలమా: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమైందని కొంత కాలంగా ప్రచారం సాగింది. పార్టీ విలీనం పైన చర్చలు జరిగాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షర్మిల వ్యవహారంలో రాయబారం చేసారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో షర్మిల నేరుగా సోనియా, రాహుల్ తో సమావేశమయ్యారు.

పార్టీ విలీనంతో పాటుగా తాను తెలంగాణకే పరిమితం అయ్యే విషయం పైన చర్చించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని సోనియా హామీ ఇచ్చారు. కానీ, తెలంగాణలో ప్రాధాన్యత పైన మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా కొందరు నేతలు అభ్యంతర వ్యక్తం చేసారు. ఈ సమయంలో షర్మిలకు సికింద్రాబాద్ లోక్ సభ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.
రేవంత్ అభ్యంతరం: షర్మిల తాను ఇప్పటికే పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించానని..అక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తనతో పాటుగా తన కోసం పని చేసిన వైఎస్సార్టీపీలోని మరి కొందరి సీట్ల విషయం పైన ప్రస్తావన చేసారు. కానీ, షర్మిలకు తెలంగాణలో ప్రాధాన్యత అంశం పైన పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదు.
పార్టీ జాతీయ కమిటీలో అవకాశం ఇస్తామని బుజ్జగించే ప్రయత్నం చేసారు. తనకు తెలంగాణలోనే రాజకీయంగా ప్రాధాన్యత కోరుకుంటున్నానని షర్మిల స్పష్టం చేసారు. ఏపీలో తన ప్రమేయం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీట్ల ఖరారు తుది దశకు వచ్చింది. షర్మిలతో సహా..మద్దతు దారులకు సీట్ల ప్రస్తావన లేకుండా పోయింది. దీంతో, షర్మిల తనతో చేసిన రాజకీయం అర్దమైంది.

షర్మిల నిర్ణయంపై ఉత్కంఠ: ఇక, కాంగ్రెస్ తో కలవాలో వద్దో తేల్చుకొనేందుకు నిర్ణయించారు. అందుకు ఈ రోజు (సెప్టెంబర్ 30) డెడ్ లైన్ గా ఫిక్స్ చేసారు. తాజాగా కాంగ్రెస్ నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదని విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో నాలుగైదు రోజుల్లో కలిసి అన్నీ చర్చిద్దామంటూ వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. కానీ, షర్మిల ఇక వేచి చూసేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు.
అవసరమైతే ఒంటరి పోరుకు సిద్దమవుతున్నారని సమాచారం. వైఎస్సార్ అభిమానులు...కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాల ఓట్లను షర్మిల పోటీలో ఉంటే చీల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే పార్టీకి..టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు ఈ వ్యవహారం సవాల్ గా మారుతుంది. దీంతో, చివరి నిమిషంలో ఒత్తిడి పెంచేలా షర్మిల అడుగులు వేస్తున్నారు. మరి ..కాంగ్రెస్ తప్పని స్థితిలో షర్మిల డిమాండ్లకు అంగీకరిస్తుందా..లేక షర్మిల రాజీ పడతారా అనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications