కాల్ మనీని తలపించేలా!: అప్పు చెల్లించలేదని భార్యను ఎత్తుకెళ్లాడు!
అప్పు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో శ్రీనివాస్ భార్యను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు.
హైదరాబాద్: ఏపీలోని విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ వ్యవహారం.. ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిన సంగతే. అధిక వడ్డీలకు రుణాలిచ్చి.. మహిళలను లైంగికంగా వేధించిన ఈ ఉదంతం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా హైదరాబాద్ లోను ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్పేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ వద్ద రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో శ్రీనివాస్ భార్యను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు చేశాడు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, అప్పు తీర్చలేదన్న కారణంతో.. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఇద్దరు తాత మనువళ్లపై ఇటీవల ఓ వడ్డీ వ్యాపారి పెట్రోల్ పోసి నిప్పటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా.. అది మరిచిపోకముందే మరో వడ్డీ వ్యాపారి ఘాతుకం వెలుగులోకి రావడం గమనార్హం.
-
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
హాట్ సమ్మర్ లో ఈ కూల్ ప్రదేశాలను చుట్టేయండి.. హైదరాబాద్ కు దగ్గరలోనే.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?












Click it and Unblock the Notifications