కాల్ మనీని తలపించేలా!: అప్పు చెల్లించలేదని భార్యను ఎత్తుకెళ్లాడు!
అప్పు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో శ్రీనివాస్ భార్యను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు.
హైదరాబాద్: ఏపీలోని విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ వ్యవహారం.. ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిన సంగతే. అధిక వడ్డీలకు రుణాలిచ్చి.. మహిళలను లైంగికంగా వేధించిన ఈ ఉదంతం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా హైదరాబాద్ లోను ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్పేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ వద్ద రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో శ్రీనివాస్ భార్యను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు చేశాడు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, అప్పు తీర్చలేదన్న కారణంతో.. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఇద్దరు తాత మనువళ్లపై ఇటీవల ఓ వడ్డీ వ్యాపారి పెట్రోల్ పోసి నిప్పటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా.. అది మరిచిపోకముందే మరో వడ్డీ వ్యాపారి ఘాతుకం వెలుగులోకి రావడం గమనార్హం.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications