వరంగల్ అగ్ని ప్రమాదం: మృతులు వీరే, సంఖ్య పెరిగే అవకాశం
వరంగల్: కోటిలింగాల వద్ద గల భద్రకాళీ ఫైర్వర్క్స్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11మంది మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. మృతుల్లో రాధిక, వినోద్, అశోక్, ఎల్లమ్మ, రఘుపతి, శ్రీవాణి, హరికృష్ణ, మణెమ్మలు ఉన్నారు. వీరంతా ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు.
కాగా, కొండకట్ల శ్రీదేవి(36) అనే మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన సురేష్, రవి, సారంగపాణి, శివలను ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రమాద సమయంలో గోదాంలో మొత్తం 25మంది ఉండగా, వీరిలో 8మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఫైర్ వర్క్స్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండానే ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications