వరంగల్ అగ్ని ప్రమాదం: మృతులు వీరే, సంఖ్య పెరిగే అవకాశం
వరంగల్: కోటిలింగాల వద్ద గల భద్రకాళీ ఫైర్వర్క్స్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11మంది మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. మృతుల్లో రాధిక, వినోద్, అశోక్, ఎల్లమ్మ, రఘుపతి, శ్రీవాణి, హరికృష్ణ, మణెమ్మలు ఉన్నారు. వీరంతా ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు.
కాగా, కొండకట్ల శ్రీదేవి(36) అనే మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన సురేష్, రవి, సారంగపాణి, శివలను ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రమాద సమయంలో గోదాంలో మొత్తం 25మంది ఉండగా, వీరిలో 8మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఫైర్ వర్క్స్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండానే ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications