హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైబర్ నేరగాళ్ల ఘాతుకం: బీహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీహార్ రాష్ట్రంలో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వాహన కంపెనీల ప్రాంఛైజీల పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు వారం రోజుల క్రితం తెలంగాణ పోలీసులు బీహార్‌ రాష్ట్రానికి వెళ్లారు.

కాగా, నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు.

 Firing on telangana police in Bihar state

Recommended Video

అవినీతి,బంధుప్రీతి పట్ల కఠినవైఖరి చూపిస్తా... మోడీ *National | Telugu OneIndia

మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్టు పోలీసులు తెలిపారు.

English summary
Firing on telangana police in Bihar state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X