ముగ్గురు కూతుళ్లకు, తల్లికి విషమిచ్చి వ్యక్తి ఆత్మహత్య
నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరి బీసీ కాలనీలో విషాదం శుక్రవారం అర్తరాత్రి విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సంచార జాతికి చెందిన రమేష్ (42) భార్య కొం తకాలం క్రిందట చనిపోయింది.
ఆ తరువాత ఊళ్లు తిరుగుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భువనగిలో ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్ లో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. భార్య లేదనే మనస్థాపానికి తోడు ఆర్దిక ఇబ్బందులు ఎదురవడంతో గత రాత్రి తన పదేళ్ళ లోపు ఉన్న ముగ్గురు పిల్లలు స్వరూప, కావేరి, నందిని, తో పాటు తన తల్లి పద్మల కు పురుగుల మందు తాగించాడు.
వారితోపాటు రమేష్ కూడా పురుగులమందు తాగి చనిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు వారు మరణించిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రమేష్ తల్లి పద్మకు 62 ఏళ్ల వయస్సుండగా, కూతుళ్లు స్వరూపకు 8 ఏళ్లు, కావేరికి 4 ఏళ్లు, నందినికి 2 ఏళ్ల వయ్ససు ఉంది.