హోలీ విషాదం: వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి
హోలీ పండుగ సందర్భంగా వరంగల్, జనగామ జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు నీట మునిగి చనిపోయారు.
వరంగల్: హోలీ పండుగ సందర్భంగా వరంగల్, జనగామ జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు నీట మునిగి చనిపోయారు. నర్మెట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామకు చెందిన క్రాంతి, నాగరాజులు ఈత కోసం బొమ్మకూరు రిజర్వాయర్కు వెళ్లారు.
ఈత కొడుతుండగా వారు నీట మునిగి మృతి చెందారు. వీరిద్దరు క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

మరో సంఘటనలో, కురవి మండలంలోని అయ్యగారిపల్లె గ్రామంలో పెద్దచెరువు నీటి ట్యాంకులో మునిగి ఇద్దరు మృతి చెందారు. కురవి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు బాలురు హోలీ ఆడారు.
హోలీ అనంతరం వారు స్నానం కోసం వెళ్లారు. అక్కడ నీటిలో మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిని వీరేంధర్ (10), చరణ్(9)లుగా గుర్తించారు.
ఇంకో సంఘటనలో తొర్రూరు మండలంలోని ఫతేపూర్ గ్రామంలో నరేష్ (20) అనే వ్యక్తి ట్యాంకులో మునిగాడు. తొర్రూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను హోలీ అడిన అనంతరం స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications