హైదరాబాద్లోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లలో తనిఖీలు: నాసీరకం పదార్థాల గుర్తింపు
హైదరాబాద్ నగరం రుచికరమైన ఆహార పదార్థాలకు పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే మన దేశంలోనే గాక ప్రపంచా వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు ఉంది. నగర వాసులు వీకెండ్స్లో ఎక్కువగా రెస్టారెంట్లలో బిర్యానీని ఆస్వాదిస్తుంటారు. ఇక, నగరానికి వచ్చినవారు ఇక్కడి బిర్యానీ రుచి చూడకుండా తిరిగి వెళ్లరనడంలో అతిశయోక్తేమీ లేదు.
అయితే, కొన్ని రెస్టారెంట్లు మాత్రం వంటకాల్లో నాణ్యత పాటించకపోవడం, నాసీరకమైన పదార్థాలను వాడటం లాంటివి చేస్తూ బిర్యానీ ప్రియులకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు జరుపుతూ అలాంటి రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్ఫోర్స్ బృందం శనివారం లక్డీకాపూల్ ప్రాంతంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు చేసింది.

అపరిశుభ్రతను గుర్తించి, లేబొరేటరీకి పంపడానికి నమూనాలను తీసుకుంది. లక్డీకపూల్ లోని 'రాయలసీమ రుచులు ' రెస్టారెంట్లో తనిఖీల చేసిన అధికారులకు నల్ల ఈగలు ఎక్కువగా సోకిన 20 కిలోల మైదా, పురుగులు సోకిన రెండు కిలోల చింతపండుతో పాటు, గడువు ముగిసిన అమూల్ పాలను గుర్తించారు. కొంత నాసీరకం ఆహార పదార్థాలను గుర్తించారు.
తయారీ లైసెన్స్ లేని మొత్తం 168 గోలీ సోడా బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. లేబుల్ లేని జీడిపప్పు, రూ.11,000 విలువైన జావర్ రోటీని కూడా తనిఖీల్లో దొరికింది. అంతేకాకుండా, వంటగది ప్రాంతంలో సరికాని నిల్వ పద్ధతులు, పరిశుభ్రత సమస్యలు కూడా గమనించారు.
మరోవైపు, షా ఘౌస్లో లేబుల్ చేయని సిద్ధం చేసిన/సెమీ-సిద్ధమైన వస్తువులు నిల్వలో గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ రికార్డులు కూడా అందుబాటులో లేవు. నీటి స్తబ్దత చట్టబద్ధమైన నమూనా తీసుకున్నారు. పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. నాసీరకమైన పదార్థాల వాడకంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు సదరు రెస్టారెంట్లు, హోటళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications