వందేళ్లలో తొలిసారి: ఓయులో నిరసనలు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడింది. ఓయులో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు, విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగాయి. ఈ ఏడాది మరో తెలుగు రాష్ట్రమైన హైదరాబాదులో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో నిరవధిక వాయిదా పడిందని తెలుస్తోంది.

2006లో హైదరాబాదులో జరిగింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యార్థి మురళి ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. కాగా, నిరవధిక వాయిదా పడితే వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. తదుపరి కార్యాచరణపై ఈ నెల 27న మరోసారి చర్చించనున్నారు. అయితే దాదాపు నిరవధిక వాయిదా పడినట్లే అంటున్నారు.












Click it and Unblock the Notifications