Tamilisai Soundararajan: హైదరాబాద్ కు చేరుకున్న తమిళిసై సౌందర రాజన్..
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె లోక్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి వెళ్లారు. చెన్నై (దక్షిణ) లోక్సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా తమిళిసై పోటీ చేశారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఆమె సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆమె హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆమెకు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
తమిళిసై సౌందరరాజన్ బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ తరుఫున ఆమె ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్లో పది రోజుల పాటు పర్యటించారు. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా పని చేసినప్పుడు చాలా సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో ఆమె ప్రచారం చేయిస్తే కలిస్తొందని భావించిన బీజేపీ పెద్దలు.. ప్రచారం చేయడానికి ఆహ్వానించారు. దీంతో ఆమె బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ కు వచ్చారు.

The warm welcome by BJP karyakarthas at Hyderabad Railway Station. Their energy and dedication are truly inspiring.#BJP #Hyderabad pic.twitter.com/ixpJSiZkMZ
— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம் ) (@DrTamilisai4BJP) April 29, 2024
రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తూ పలువురు ప్రముఖ అభ్యర్థులను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మే 13 పోలింగ్ జరగనుంది. ఇక దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications