ఈటల రాజేందర్తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక భేటీ: హుజూరాబాద్ ఉపఎన్నికపైనే చర్చ
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గ పాదయాత్రలో ఉన్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ను బుధవారం మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు కలిశారు.
గూడూరు వద్ద కారులో అరగంటపాటు రహస్యంగా ఈ ముగ్గురు మంతనాలు జరపడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తిగా మారింది. ఉపఎన్నికలో ఈటల గెలుపే లక్ష్యంగా చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని, అయితే ఎప్పుడు చేరతాననేదానిపై త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఈటల రాజేందర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ భేటీపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ను ఓడించేందుకు అందరూ ఒకే వేదికపైకి వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ కు ఉపఎన్నికలో మద్దతు పలుకుతుందా? అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. తనను ఉపఎన్నికలో గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఈటల రాజేందర్ తోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications