వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ...: కారు బావిలో పడి నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

జగిత్యాల: దైవ దర్శనార్థం కోసం వెళ్లి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన రెండు కుటుంబాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ సమీపంలోని కుర్మపల్లి వద్ద కారు అదుపు తప్పి వేములవాడ, కొండగట్టు రహదారికి అనుకుని ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దైవదర్శనం కోసం వచ్చిన వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావిలో పడింది.

Four die as car plunged into a well

ఈ సంఘటనలో నలుగురు మృత్యువాత పడగా, నవీన్ అనే వ్యక్తి ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ప్రమాదంలో హన్మకొండకు చెందిన కన్నం రామస్వామి (65) సార్వదేవి (55) కూర కుమారస్వామి (45) సుభాషిణి (40) మృత్యువాత పడ్డారు. కన్నం నవీన్ ప్రాణాలు దక్కించుకున్నాడు.

రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బావిలో పడిందని జిల్లా ఎస్పీ అనంతశర్మ ఘటన స్థలం వద్ద మీడియాకు తెలిపారు. ఎస్పీ తన సిబ్బందితో సహాయక చర్యల్లో పాల్గొని భారీ క్రేన్ల సహాయంతో బావిలో పడిన కారును, మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Four members of a family dead, as car plunged into a well in Jagityala district of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X