మంచిర్యాల జిల్లాలో విషాదం: అప్పుల బాధతో కుటంబం ఆత్మహత్య..
సోమగూడెం: మంచిర్యాల జిల్లా సోమగూడెం మండలం చొప్పరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది.
వివరాల్లోకి వెళ్తే.. చొప్పరిపల్లికి చెందిన కొండగొర్ల తిరుపతి(38), భూదేవి(32) దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు.

అయితే పంట నష్టం కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. పంట దిగుబడి తగ్గిపోవడంతో అప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది.
తొలుత తిరుపతి తన భార్యకు ఉరేసి.. ఆపై ఇద్దరు పిల్లలు కీర్తన(14), శశాంత్(13)లకు నిద్రమాత్రలు వేశాడు. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందగా.. ప్రస్తుతం కీర్తన పరిస్థితి విషమంగా ఉంది. శశాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరికి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అప్పుల బాధతో గతంలోనూ తిరుపతి కుటుంబం ఓసారి ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు చెబుతున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications