ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సమాచార కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద ఇందుకోసం స్టూడెంట్స్ లైన్లులో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు డబ్బులు కట్టిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మే 15లోపు కొత్త ఫలితాలు, మెమోలు విద్యార్థుల ఇంటికే వస్తాయని చెప్పింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఫెయిలైన ఫెయిలైన విద్యార్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు కట్టాలని సూచించింది.
ఇంటర్ వివాదంపై ఎట్టకేలకు స్పందించిన సీఎం.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫ్రీ రీవాల్యుయేషన్ !