ఎమ్మెల్యేల ఎర కేసు: నిందితుల విచారణ పూర్తి, ఆ డబ్బుపై ప్రశ్నలు, 25 వరకు రిమాండ్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. గురువారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ప్రశ్నించిన సిట్ అధికారులు.. చివరిదైన శుక్రవారం కూడా అక్కడే ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, షింమయాజీ నుంచి స్వర నమూనాలు సేకరించిన అధికారులు భిన్న కోణాల్లో వారిని విచారించారు.
నిందితులను రెండు రోజులపాటు రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. కస్టడీ ముగియడంతో అక్కడ్నుంచి ముగ్గురినీ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా నిందితుల బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ముగ్గురు నిందితులకు నవంబర్ 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వాంగ్మూలం కీలకమవుతుందని ప్రత్యేక దర్యా ప్తు బృందం భావిస్తోం ది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్ రోహిత్ రెడ్డికిడ్డి రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల
చొప్పున ఇప్పిస్తాననడంతో ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశంపై సిట్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలతో ఫాంహౌస్లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నిం చినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానమే వచ్చినట్లు సమాచారం. నిందితులను విచారిస్తున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లినళ్లి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ
ఆనంద్.. విచారణ తీరును పరిశీలించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications