బంపర్ ఆఫర్ : చెత్తకు బంగారం
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా జిహెచ్ ఎంసి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. స్వచ్చ హైద్రాబాద్ కార్యక్రమానికి సహకరించే పౌరులకు నజారానాలను ప్రకటించింది.
హైదరాబాద్ :బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా జిహెచ్ ఎంసి వినూత్న పథకాన్ని శ్రీకారం చుట్టింది. స్వఛ్చ హైద్రాబాద్ లో కార్యక్రమానికి సహకరించే సౌరులకు నజారానాలను ప్రకటించింది.బంగారం, నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా స్వచ్చ హైద్రాబాద్ కార్యక్రమంలో భాగంగా జిహెచ్ ఎంసి వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. తడి , పొడి చెత్తను వేరుచేసి ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంప్ యార్డులకు తరలిస్తున్నారు. ఈ చెత్తను తరలించేందుకు ప్రత్యేకంగా ఆటోట్రాలీలను ఇచ్చారు.

అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాల్లో చెత్తను వేస్తున్నారు గతంలో కంటే ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తగ్గిపోయింది. బహిరంగ ప్రాంతాల్లో చెత్తను వేస్తే శిక్షించేందుకు కూడ సిద్దమౌతోంది జిహెచ్ ఎంసి
దీనికి తోడు స్వచ్చ హైద్రాబాద్ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసే కార్మికులకు నజారానాను ప్రకటించారు. స్వచ్చ హైద్రాబాద్ కార్యక్రమానికి సహకరించే పౌరులకు కూడ నజరానాలను వర్తింపజేయనున్నారు.
స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమానికి సహకరించిన పౌరులకు, పారిశుద్య కార్మికులకు బంగారం, నగదు బహుమతులను జిహెచ్ ఎంసి ప్రకటించింది.జిహెచ్ ఎంసి సర్కిళ్ళు, వార్డుల వారీగా ఈ బహుమతులను ఇవ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications