అన్నా అని పిలిచేది: గదిలో పెట్టి నోట్లో గుడ్డలు కుక్కి అమ్మాయిపై 24 గంటలు రేప్
వరంగల్: ఓ వ్యక్తిలో మృగాడు రెచ్చిపోయాడు. అన్న అని పిలిచే ఓ అమ్మాయిపై అత్యంత దారుణంగా వ్య.వహరించాడు. గదిలో పెట్టి తాళ్లతో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి 24 గంటలపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించింది. దాంతో ఆమె ఒళ్లంతా వాతలు తేలేలా, కందిపోయేలా తెగబడ్డాడు.
ఈ దారుణ సంఘటన వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న పెద్దమ్మ గడ్డలో జరిగింది. నగరానికి చెందిన బాధిత యువతి ఇంటర్ పూర్తి చేసి ప్రభుత్వ ఐటీఐలో చదువుతోంది. తమ ఇంటి ఎదురుగా ఉండే జోగు శ్రీనివాస్ అలియాస్ వాసు అనే యువకుడితో ఆమెకు పరిచయమైంది.
మూడేళ్లుగా ఆమె చదువుకు కొద్దికొద్దిగా డబ్బులిస్తూ నమ్మకంగా మంచివాడిలా నటిస్తూ వచ్చాడు. ఈ నెల 4న (శనివారం) కళాశాలకు బయలు దేరిన ఆ అమ్మాయిని అతను మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని పెద్దమ్మగడ్డలో ఓ కళాశాల పక్కన ఉన్న వేల్పుగొండ కుమారస్వామి అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఆమె ఎంతగా బతిమాలుడుకున్నా అతను వినలేదు. చెప్పుకోరాని చోట కర్రతో కొట్టి హింసించాడు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పదేపదే అత్యాచారం చేస్తూ ఆమెకు నరకం చూపించాడు. అతను భోజనం కోసం బయటకు వెళ్లినప్పుడు ఆమె ఎలాగోలా కట్లువిప్పుకొని అక్కడి నుంచి తప్పించుకుంది.
ఇంటికి చేరుకుని విషయం తల్లికి చెప్పింది. కూతురి శరీరంపై ఉన్న గాయాలు చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. సోమవారం విద్యార్థినితోపాటు కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు హన్మకొండ ఏసీపీ శోభన్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు.నిందితుడు శ్రీనివాస్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని హన్మకొండ పోలీసులు తెలిపారు.