గ్లోబల్ సదస్సులో దిమ్మతిరిగే షాక్: కేటీఆర్కు ఊహించని ప్రశ్న, సానియా ఏమన్నారంటే
హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని ప్రశ్న ఎదురైంది.
హైదరాబాద్: హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇవాంకా ట్రంప్, చందా కొచ్చార్ తదితరులతో కలిసి ఆయన వేదికను పంచుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేకపోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురయింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేకపోవడంపై ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్నాయి.

గ్లోబల్ సదస్సు వేదికపై కేటీఆర్కు ఊహించని ప్రశ్న
ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వేదికగా మీడియాతో మాట్లాడుతుండగా కేటీఆర్కు మహిళా మంత్రుల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. మహిళలకు అవకాశాలు, సాధికారతపై ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎందుకు లేరని ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చాకచక్యంగా సమాధానం ఇచ్చారు.
Recommended Video


ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు
తమ ప్రభుత్వంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, మంత్రి పదవులపై సీఎం కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెంచాలన్న వాదనకు తాము కట్టుబడి ఉన్నామని, మహిళా బిల్లుకు మా పార్టీ మద్దతు ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే దీనిపై శాసన సభలో తీర్మానం చేశామని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళల కోసం పోరాడే వేదిక హైదరాబాద్ కావడం ఆనందదాయకం అన్నారు.

రాత్రికి రాత్రే ఎవరూ కాలేరు
ఇదిలా ఉండగా, గ్లోబల్ సమ్మిట్ వేదికపై సానియా మీర్జా, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్లు మాట్లాడారు. హర్షాబోగ్లే సమన్వయకర్తగా వ్యవహరించారు. టెన్నిస్, క్రికెట్ లాంటి క్రీడల్లో మహిళలు రాణిస్తున్నారని సానియా తెలిపారు. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరన్నారు. క్రీడల్లో మహిళలను మరింత ప్రోత్సహించాలన్నారు.

ప్రోత్సహించాలి
క్రీడారంగంలో మహిళలు రాణిస్తున్నారని గోపీచంద్ అన్నారు. భారత్లో క్రీడాకారులు అన్ని ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పిల్లలను క్రీడల పట్ల తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అమ్మాయిలు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తున్నారని మిథాలీ రాజ్ అన్నారు. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆట స్థలాలు లేవని వాపోయారు.

అదృష్టం కొద్ది క్రీడాకారుడు మంత్రి అయ్యారు
రాజకీయ నాయకులు క్రీడల్లోకి చొరబడుతున్నారని హర్షాబోగ్లే అభిప్రాయపడ్డారు. అదృష్టం కొద్ది ఇప్పుడు ఓ క్రీడాకారుడు క్రీడామంత్రి అయ్యారని గుర్తు చేశారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ మూడు రోజుల పాటు జరగనుంది. మంగళవారం ప్రారంభమైంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications