Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విద్యార్ధులకు తీపికబురు.. తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ రిలీజ్ !

తెలంగాణలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల (DOST) 2025-26 నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన కలిసి రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియతో లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,67,456 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఈ సంవత్సరం మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు జరుగనున్నాయని తెలుస్తోంది. మొదటి విడత దరఖాస్తుల కోసం మే 3 నుండి 21 వరకు అవకాశం ఉంటుంది. మే 10 నుండి 22 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను వెబ్ ఆప్షన్ల రూపంలో ఎంచుకోవచ్చు. ఆ తర్వాత సీట్ల కేటాయింపు మే 29న ప్రకటించబడుతుంది. చివరగా తరగతులు జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

good-news-for-students-dost-notification-released-in-telangana

ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,057 డిగ్రీ కళాశాలలు ఉండగా, వాటిలో 987 కళాశాలలు దోస్త్ పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన 70 కళాశాలలు ఈ ప్రక్రియలో పాల్గొనడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి బకెట్ సిస్టమ్ ప్రవేశాలలో అమల్లోకి రానుంది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు అనుసరించి సీట్లు కేటాయించబడతాయి. పూర్తి వివరాల కోసం https://dost.cgg.gov.in/ అధికారిక వెబ్ సైట్ ను చూడొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+