తెలంగాణా రైతులకు సర్కార్ తీపి కబురు.. ఆ డబ్బులు జమ!
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న రేవంత్ సర్కార్ తాజాగా పెండింగ్లో ఉన్న సన్న వడ్ల బోనస్ మొత్తాలను విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేసింది. ఖరీఫ్ దానం కొనుగోలు ముగిశాయని, రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా చెల్లించామని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
సన్నబియ్యం సాగు చేసిన రైతులకు బోనస్
2025- 2026 వానకాలం సీజన్లో 2.17లక్షల మంది అన్నదాతలు సన్న బియ్యం వరి సాగు చేశారు. ఖాతాలలో 514. 36 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. గ్రేడ్ ఏ సన్నరకం ధాన్యానికి కేంద్ర ప్రభుత్వంకు క్వింటాలుకు 2389 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 రూపాయల బోనస్ అందించింది.

సన్న వడ్లను విక్రయించిన 7.49 లక్షల మంది రైతులు
దీంతో రైతుల ఖాతాలకు క్వింటాలుకు మొత్తం 2,889 రూపాయలు జమయ్యాయి. తమ ఖాతాలను ఈ మేరకు చెక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న వడ్లను విక్రయించారు. అయితే సోమవారం నాటికి 99.25 శాతం మందికి 1939. 58 కోట్లు బోనస్ గా అందినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
త్వరలో ఆ డబ్బులు కూడా విడుదల
మిగిలిన 14.62 కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ లో తెలంగాణా పౌర సరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. ఇందులో సన్న రకం వడ్లు 39.08 లక్షల టన్నులు కాగా, ధాన్యం 32.78 లక్షల టన్నులు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం పెరగడంతో కొనుగోలు కేంద్రాలకు కూడా భారీగా సన్నరకం ధాన్యం వచ్చింది.
రైతుల ఖాతాల్లో అదనంగా క్వింటాలుకు 500రూపాయలు
రాష్ట్రవ్యాప్తంగా 8448 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి బియ్యాన్ని సేకరించారు. ఈ సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నులను పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాములలో నిలువ చేసింది. మొత్తంగా సన్న బియ్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఈ మేరకు వారికి ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేస్తూ సన్న బియ్యం సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
మూసీపై కేబినెట్ సబ్ కమిటీ- సభ్యులు వీళ్లే -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications