ఇల్లు కట్టుకోవాలనుకునే హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త!
గ్రేటర్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి శుభవార్త. హైదరాబాదులో ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి అనుమతి తీసుకోవడం దగ్గర నుంచి, ఇంటి నిర్మాణానికి కావలసిన ఇసుకను తెచ్చుకోవడానికి కూడా నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. విపరీతంగా ఇసుక ధరలు పెంచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ టిజిఎండిసి కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఇసుక బజార్ లు
ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో రెండు, మూడు వేల రూపాయలు అదనంగా తీసుకుని విక్రయిస్తున్న ఇసుక దందాకు చెక్ పెట్టడం కోసం ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది.
ఇసుక బజార్లలో నేరుగా, వేగంగా, తక్కువ ధరకు ఇసుకను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలలో భాగంగానే టీజీ ఎండీసీ హైదరాబాద్లో గృహ నిర్మాణ దారులు, మరియు సామాన్య ప్రజల అవసరాలకు తగినట్టుగా ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నాలుగు చోట్ల ఇసుక బజార్ లు
ఇసుక కావలసినవారు ఫోన్ చేస్తే 48 గంటల్లోనే ఇసుకను ఇంటికి నేరుగా సరఫరా చేసేలాగా ఏర్పాట్లు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అబ్దుల్లాపూర్మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో మొత్తం నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణదారులకు రిలీఫ్
గతంలో వివిధ జిల్లాల నుంచి ఇసుకను హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రైవేట్ వ్యాపారదారులు అధిక ధరలకు విక్రయించేవారు. ఇక అవసరాన్ని బట్టి ప్రజలకు కొనక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వమే నేరుగా ఇసుక బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు తీసుకొని విక్రయిస్తూ ఉండడంతో గృహ నిర్మాణదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
త్వరలో మరిన్ని చోట్ల ఇసుక బజార్ లు
ఈ నాలుగు చోట్ల మాత్రమే కాకుండా త్వరలో శామీర్ పేట, ఘట్కేసర్ ప్రాంతాలలో కూడా ఇసుక బజార్ లను ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా ఇసుక కావాలంటే టీజీఎండీసీ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇసుక రీచ్ నుండి దూరాన్ని బట్టి వాహనాల అద్దె చెల్లించాలని, ఆర్డర్ చేసిన 48 గంటల్లో ఇసుకను ఇంటికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇసుక బజార్ ల ఏర్పాటు గుడ్ న్యూస్
ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాలకు నల్గొండ, కొత్తగూడెం రీచ్ ల నుంచి ఇసుక సరఫరా అవుతున్నట్టు చెబుతున్నారు. గృహ నిర్మాణాలు చేసుకోవాలనుకునే సామాన్యులకు తక్కువ ధరకు ప్రభుత్వమే ఇసుకను అందించే ఇసుక బజార్లను ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామంగా చెప్పాలి.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications