హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్, ఆర్సీఎస్ టికెటింగ్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు మరింత సులభంగా మెట్రో టికెట్లను బుక్ చేసుకునేలా రూపొందించిన 'గూగుల్ వ్యాలెట్'ను ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(RCS) సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ వ్యాలెట్ తో ప్రయాణికులు క్యూలైన్లలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే ప్రయాస తప్పుతుందని, అంతేగాక సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన సమయం నుంచి నేటి వరకు ఎన్నో మార్పులు తీసుకొస్తూనే ఉన్నామని చెప్పారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ముందుకు వెళ్తున్నామని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో రైలు విస్తరణతో హైదరాబాద్ నలుమూలల ఉన్న ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభగా మారుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
కాగా, రూట్ మొబైల్ ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ ప్రయాణికులకు ప్రత్యేకమైన టికెటింగ్ అనుభవాన్ని అందించడానికి ముంబైకి చెందిన ఇంటిగ్రేషన్ భాగస్వామి అయిన బిల్లేసీ ఇ సొల్యూషన్స్ (బిల్లీసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS), Google Wallet సేవలను అందిస్తుంది. ప్రయాణికులు సులభంగా ఇ-టికెట్లను బుక్ చేసుకోవడానికి, వాటిని Google Walletలో సేవ్ చేయడానికి, వాటిని బహుళ ఛానెల్లలో యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వినూత్న పరిష్కారం మెట్రో టికెటింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణాలను అందిస్తుంది.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications